News March 7, 2025

ఐనవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. క్షతగాత్రుడు ఇల్లంద గ్రామానికి చెందిన నిమ్మనబోయిన రమేశ్(38)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 10, 2026

కడప జిల్లాలోని మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

image

కడప కార్పొరేషన్ సహా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. వీటికి ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో 284 జారీ చేసింది. కడపకు కలెక్టర్, ప్రొద్దుటూరుకు జాయింట్ కలెక్టర్, మిగతా ఐదు పట్టణాలకు ఆర్డీవోలు స్పెషల్ ఆఫీసర్లుగా ఆరు నెలల పాటు విధుల్లో ఉండనున్నారు.

News March 10, 2026

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో ACB అధికారుల సోదాలు

image

విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ACB అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి రమణమూర్తితో పాటు పలువురు సిబ్బందిపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సోదాల్లో కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమ లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో లోతైన విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

News March 10, 2026

బాసర నుంచి భద్రాద్రి వరకు.. ఆధ్యాత్మిక శోభ

image

గోదావరి పుష్కరాల లోపు బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. ముఖ్యంగా భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్రణాళికను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ఆమోదం పొందాలని సూచించారు.