News March 23, 2024
ఖమ్మం: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711134763977-normal-WIFI.webp)
కారేపల్లి బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పి.రామగోపిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ జయరాజు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి విధులకు హాజరుకాకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పాఠశాలలో విద్యావలంటీర్ను ఏర్పాటుచేసినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 8, 2024
నీటి ప్రవాహానికి ఊపిరాడక వాహనదారుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720432467672-normal-WIFI.webp)
మధిర శివాలయం వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైరా నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి మడుపల్లి గ్రామానికి ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రోడ్డు కుంగి తూములో ఇరుక్కున్నాడు. దీంతో నీటి ప్రవాహానికి ఊపిరాడక అతడు మృతి చెందాడు. మృతుడు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన బోశెట్టి రమేష్గా పోలీసులు గుర్తించారు.
News July 8, 2024
ఖమ్మం జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720420884263-normal-WIFI.webp)
తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.
News July 8, 2024
గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416024568-normal-WIFI.webp)
భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.