News March 7, 2025

బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 270 మంది గైర్హాజరు

image

బాపట్ల జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షకు 270 మంది విద్యార్థులు హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 8,390 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 8120 మంది పరీక్షలకు వచ్చారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Similar News

News March 28, 2026

యుద్ధంలోకి యెమెన్ హౌతీలు.. ఇజ్రాయెల్‌పై మిస్సైల్ దాడి

image

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు పశ్చిమాసియా యుద్ధంలోకి దిగారు. ఇవాళ యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పైకి బాలిస్టిక్ మిస్సైల్‌ను లాంచ్ చేశారు. దాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఎవరికీ గాయాలు కాలేదంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీల మొదటి దాడి ఇదే. కాగా ఇరాన్‌కు వ్యతిరేకంగా US, ఇజ్రాయెల్‌ యుద్ధంలోకి ఎవరైనా వస్తే తామూ రణరంగంలోకి దిగుతామని హౌతీలు నిన్న ప్రకటించారు.

News March 28, 2026

రాత్రి ఫోన్ చేసి ఇన్నర్‌వేర్‌పై ప్రొఫెసర్ ప్రశ్నలు!

image

చెన్నైలోని అన్నా వర్సిటీ ప్రొఫెసర్ జ్ఞానవేల్‌పై ఒక విద్యార్థిని సంచలన ఫిర్యాదు చేశారు. ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని దగ్గరై తనను వేధించాడని బాధితురాలు ఆరోపించారు. రాత్రి వేళల్లో ఫోన్ చేసి ఇన్నర్‌వేర్, పీరియడ్స్, పెళ్లి వంటి పర్సనల్ విషయాలపై అసభ్యంగా మాట్లాడుతూ టార్చర్ పెట్టేవాడని తెలిపారు. నంబర్ బ్లాక్ చేసినా ఇతర మార్గాల్లో వేధించాడని పేర్కొన్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

News March 28, 2026

TU: ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్

image

TU పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ(అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) విద్యను అభ్యసిస్తున్న 8వ, 10వ సెమిస్టర్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించడానికి నేడే చివరి తేదియని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. నేడు సాయంత్రం 5గం.ల లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుము రూ.100 తో ఈనెల 31లోగా చెల్లించవచ్చని తెలిపారు.