News March 7, 2025
జన్ ఔషధీ కేంద్రాలతో రూ.30K కోట్లు ఆదా: నడ్డా

దేశ వ్యాప్తంగా ఉన్న 15వేల PM జన్ ఔషధీ కేంద్రాల వల్ల 10 లక్షల మంది ప్రజలు ఖరీదైన మందులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని కేంద్ర వైద్యశాఖ మంత్రి JP నడ్డా తెలిపారు. దీని వల్ల ప్రజలకు రూ.30వేల కోట్ల వరకు ఆదా అవుతోందన్నారు. 50-90% తక్కువ ధరలకే జన్ ఔషధీ కేంద్రాల్లో మందులు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఆయా కేంద్రాల్లో 2వేలకు పైగా మందులు, 300 వరకు సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
Similar News
News December 27, 2025
కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. ఈ పనులు చేయాలట!

2026లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, ఇంటిముందు ముగ్గులు వేసి తులసి కోటను పూజించాలి. తులసి మొక్కకు ఎరుపు దారం కట్టి విష్ణు మంత్రాలు జపించాలి. ఇది ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి, ఆవుకు గ్రాసం తినిపించాలి. ఇలా చేస్తే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది’ అంటున్నారు.
News December 27, 2025
తల్లిదండ్రులు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్ల వల్లే పిల్లలకు మాటలు లేట్గా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఆరునెలలు రాగానే ఘనపదార్థాలు నెమ్మదిగా అలవాటు చెయ్యాలి. అప్పుడే నాలుకకు వ్యాయామం అందుతుందంటున్నారు. అలాగే సిప్పీ కప్పుల వాడకం తగ్గించాలి. దీనివల్ల కూడా మాటలు ఆలస్యమవుతాయని చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాటలు రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 27, 2025
భారీ జీతంతో AVNLలో ఉద్యోగాలు

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<


