News March 7, 2025

లోక్ అదాలత్.. కడప జిల్లా వ్యాప్తంగా 16 బెంచీలు ఏర్పాటు

image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి, కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కడపలో 5, ప్రొద్దుటూరు 3, రాజంపేట 3, రాయచోటి 2, బద్వేల్ 2, జమ్మలమడుగు 1 బెంచీ చొప్పున 16 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 16, 2026

NTR: ఆ పంచాయతీల్లో RR యాక్ట్ అమలాయ్యేనా..?

image

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై NTR కలెక్టర్ లక్ష్మీశ కఠిన చర్యలు చేపట్టారు. పెనుగంచిప్రోలు, ముత్యాల, కంచికచర్ల, రామవరప్పాడు సర్పంచులు, అధికారులు రూ. కోట్లలో నిధులు పక్కదారి పట్టించడంతో రికవరీకి ‘రెవెన్యూ రికవరీ’ యాక్ట్ ప్రయోగించారు. అయితే నిందితులు రాజకీయ పలుకుబడితో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిధుల రికవరీ ప్రక్రియ ఇప్పుడు కలెక్టర్‌కు సవాలుగా మారింది.

News March 16, 2026

NTR: ఆ పంచాయతీల్లో RR యాక్ట్ అమలాయ్యేనా..?

image

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై NTR కలెక్టర్ లక్ష్మీశ కఠిన చర్యలు చేపట్టారు. పెనుగంచిప్రోలు, ముత్యాల, కంచికచర్ల, రామవరప్పాడు సర్పంచులు, అధికారులు రూ. కోట్లలో నిధులు పక్కదారి పట్టించడంతో రికవరీకి ‘రెవెన్యూ రికవరీ’ యాక్ట్ ప్రయోగించారు. అయితే నిందితులు రాజకీయ పలుకుబడితో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిధుల రికవరీ ప్రక్రియ ఇప్పుడు కలెక్టర్‌కు సవాలుగా మారింది.

News March 16, 2026

నేను పార్టీ మారడం లేదు: ఎమ్మెల్యే మల్లారెడ్డి

image

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నాననే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. “నా వయస్సు 73 ఏళ్లు, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు” అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే లాంటిదని ఎద్దేవా చేశారు. ఇటీవల CMని కలిసింది కేవలం తన ఓ వేడుకకు ఆహ్వానించడానికి మాత్రమేనన్నారు.