News March 7, 2025
ఏలూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఏలూరు నిమ్మకాయల యాడ్ సమీప రైల్వేగేట్ వద్ద శుక్రవారం ఓ వ్యక్తి రైలు పట్టాలను దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సైమన్ మాట్లాడుతూ.. మృతుడు కాకర్ల నాగార్జున (28)గా గుర్తించామన్నారు. మృతుడు కోమడవోలు పంచాయతీగా నిర్ధారించామన్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.
Similar News
News February 27, 2026
ప్రభాస్ ‘స్పిరిట్’లో వివేక్ ఒబెరాయ్

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు ప్రకటించిన టీమ్.. ఆయన లుక్ను విడుదల చేసింది. ఈ సినిమా మార్చి 5, 2027న రిలీజ్ కానుంది. ఇందులో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు.
News February 27, 2026
కామారెడ్డి: సంఘటన్ సృజన్ అభియాన్తో సంస్థాగత బలోపేతం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘటన్ సృజన్ అభియాన్ 7వ రోజు శిక్షణ శిబిరం విజయవంతంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ మైనారిటీ విభాగం ఛైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గార్హీ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ స్థాయి నిర్మాణ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై మార్గదర్శనం చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నగేశ్ రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
News February 27, 2026
HYD: ఆ రోజు ఆలయాలు బంద్!

చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న కడ్తాల్లోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు శివాలయ, రామాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత చెప్పారు. మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ శుద్ధి, అభిషేకం, అలంకరణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. గ్రహణం దృష్య్టా నగరంలోని ప్రముఖ ఆలయాలను సైతం మూసివేయనున్నారు.
SHARE IT


