News March 7, 2025
రైతుల్ని ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు: కలెక్టర్

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, సంబంధిత రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను రైతుకు చెల్లించాల్సిందేనన్నారు.
Similar News
News April 22, 2025
పరారీలోనే కాకాణి..దక్కని రిలీఫ్

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ దక్కకపోవడంతో అజ్ఞాత వాసం కొనసాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సోమవారం హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటీషన్ విచారణ పరిధిని తేల్చే అంశాన్ని ధర్మాసనం ముందుపెట్టింది. మరోవైపు కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.
News April 22, 2025
నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు: నెల్లూరు కలెక్టర్

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
News April 21, 2025
చట్టపరంగా న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. బాధితుల అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.