News March 7, 2025
క్వశ్చన్ పేపర్ లీక్.. ఎగ్జామ్ రద్దు

AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ <<15680685>>పరీక్షా పత్రం లీకేజీ<<>> అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విచారణ చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News April 6, 2026
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సెటైర్లు!

హార్ముజ్ జలసంధిని తెరవకపోతే నరకానికి పంపుతానంటూ బూతులతో ట్రంప్ <<19575126>>హెచ్చరించడం<<>>పై ఇరాన్ సెటైర్లు వేస్తోంది. ‘ఓ టీనేజర్లా అధ్యక్షుడు బూతులు తిట్టే తీరు చూస్తుంటే.. అమెరికా ఊహించిన దాని కంటే ముందే రాతియుగానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది’ అని థాయ్లాండ్లోని ఇరాన్ ఎంబసీ ఎద్దేవా చేసింది. ‘ట్రంప్.. ఇంకేదైనా మాట్లాడవా. బోర్ కొడుతోంది’ అంటూ జింబాబ్వేలోని ఎంబసీ ఎగతాళి చేసింది.
News April 6, 2026
‘కిస్సింగ్ డిసీజ్’తో చాలా డేంజర్

జ్వరం, నీరసం, గొంతు నొప్పితో వచ్చే ‘మోనో’ అనే ఇన్ఫెక్షన్ను చాలా మంది లైట్ తీసుకుంటారు. కిస్ చేయడం, డ్రింక్ షేర్ చేసుకోవడం, దగ్గు వల్ల ఇది వ్యాపిస్తుంది. అందుకే దీన్ని కిస్సింగ్ డిసీజ్ అంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) అనే ప్రాణాంతక జబ్బు వచ్చే ప్రమాదం ఉందని ‘న్యూరాలాజీ ఓపెన్ యాక్సెస్’లో పబ్లిష్ అయిన స్టడీ తెలిపింది. MS వల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయి.
News April 6, 2026
RBI వడ్డీ రేట్లు మారకపోవచ్చు: ఎకనమిస్టులు

వడ్డీ రేట్లలో RBI ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని, యథాతథంగా కొనసాగించవచ్చని ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు. రూపాయి పడిపోవడం, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేట్ల సవరణకు మొగ్గుచూపకపోవచ్చని అంటున్నారు. గత సమీక్షలోనూ రెపో రేటును 5.25 శాతం వద్దే <<19064412>>కొనసాగించడం<<>> తెలిసిందే. RBI MPC 3 రోజుల సమీక్ష ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. కమిటీ నిర్ణయాలను 8వ తేదీన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు వెల్లడించనున్నారు.


