News March 7, 2025

సత్యసాయి: ‘నైపుణ్యాలను తప్పక పెంచుకోవాలి’

image

విధులలో నైపుణ్యాలు మెరుగుపరచుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని రాయలసీమ రీజియన్ ఇన్‌ఛార్జి హోంగార్డ్స్ కమాండెంట్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు జిల్లాలోని హోంగార్డ్స్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.

Similar News

News March 14, 2026

గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

image

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.

News March 14, 2026

WGL: కార్యదర్శులకు డబుల్ ఒత్తిడి!

image

గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పని భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరులోగా పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలనే ఆదేశాలు ఒకవైపు ఉండగా, ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మరోవైపు పడింది. సర్వేలు, సమావేశాలు, నివేదికలతో పని భారం పెరిగి పన్నుల వసూళ్లు చేయడం కష్టమవుతోందని ఉమ్మడి జిల్లా కార్యదర్శులు వాపోతున్నారు.

News March 14, 2026

రాజమండ్రి: ఆగని మరణాలు.. మరో ఇద్దరు మృతి

image

రాజమండ్రిలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. కిమ్స్ బుల్లినేని ఆసుపత్రిలో కడలి కృష్ణారావు (75), డెల్టా ఆసుపత్రిలో రెడ్డి అనంతలక్ష్మి (55) మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. ఇంకా ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.