News March 23, 2024

4 నుంచి డిపార్ట్‌మెంటల్ టెస్టులకు దరఖాస్తులు

image

AP: అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వహణకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మేలో జరిగే పరీక్షల తేదీల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంది. 26 జిల్లా కేంద్రాలతో పాటు ఢిల్లీలోనూ పరీక్ష కేంద్రాలు ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News November 2, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు: Lok Poll సర్వే

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తెలిపింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్‌కు 38శాతం, బీజేపీ 15శాతం, ఇతరులు 3శాతం ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన <<18171588>>కేకే సర్వేలో<<>> బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక ఈ నెల 11న జరగనుంది.

News November 2, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 16 ఉద్యోగాలు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<>IOL<<>>) దులియాజాన్‌లో 16 కాంట్రాక్టువల్ డ్రిల్లింగ్/వర్క్ఓవర్ ఆపరేటర్, వర్క్‌ఓవర్ అసిస్టెంట్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా లేదా సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://www.oil-india.com/ను సంప్రదించండి.

News November 2, 2025

ప్రతిరోజు తప్పక పఠించాల్సిన 4 మంత్రాలు

image

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది