News March 7, 2025
BREAKING: హనుమకొండ జిల్లాలో MURDER

హనుమకొండ జిల్లాలో కాసేపటి క్రితం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం వీర్నరాయణపూర్లో తల్లిని కొడుకు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
సంగారెడ్డి: ‘పాఠశాల నిధులను విడుదల చేయాలి’

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నిర్వహణ నిధులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడిచిన ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదని అన్నారు.
News October 28, 2025
HYD: ఆన్లైన్లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు!

GHMC పౌరులకు సేవలను సులభతరం చేసింది. ఇకపై ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు ghmc.gov.in ద్వారా ఇంటి నుంచే లభిస్తాయి. పౌరులు మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం తమ PTIN/TIN/VLTN నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే చాలు. దరఖాస్తులకు త్వరితగతిన ఆన్లైన్ ద్వారానే అనుమతులు లభిస్తాయి.
SHARE IT
News October 28, 2025
పునరావాస కేంద్రాల్లో ఆహారం, దుప్పట్లు పంపిణీ

AP: ‘మొంథా’ తుఫాను ప్రభావిత జిల్లాల్లో నిరాశ్రయులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానికంగా వారికి ఆశ్రయం కల్పించి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధమయ్యాయి. అటు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.


