News March 7, 2025
ఏలూరు జిల్లా టూడే టాప్ న్యూస్

*వృద్ధురాలిపై దాడి.. ఇద్దరి అరెస్ట్. *మినుములు, పెసలు కొనుగోలుపై జేసీ ధాత్రి రెడ్డి సమీక్ష. *ఎస్పీ కార్యాలయంలో దివస్ కార్యక్రమం. *జిల్లాలో 8వ తేదీ నుంచి పి -4 సర్వే: కలెక్టర్. *మహిళ దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్, జేసీ.*ద్వారకా తిరుమలలో కరెంట్ స్థంభాన్ని డీ కొట్టిన లారీ. *ఏలూరు: ఆసుపత్రి వాష్రూమ్లో పసికందు మృతదేహం. * ఏలూరు: రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తి మృతి.
Similar News
News March 22, 2026
ముదిగుబ్బ: ప్రమాదంలో వ్యక్తి స్పాట్డెడ్

ముదిగుబ్బ మండలం దొరిజిగిల్లు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పుట్టపర్తిలోని సమాధి రోడ్డులో ఉండే రాము (50) బైక్పై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతను మృతి చెందాడు. మృతుడిని 108లో ముదిగుబ్బ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2026
ఉస్తాద్ భగత్సింగ్ టికెట్ రేట్స్ తగ్గింపు

AP: పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో రేపటి నుంచి తగ్గనున్నాయి. ఉగాదికి రిలీజైన ఈ మూవీకి 10రోజుల పాటు హైక్కు ప్రభుత్వం అనుమతించింది. అయితే TGతో సమానంగా ధరలను ఉంచేందుకు మేకర్స్ రేపటి నుంచే తగ్గించాలని డిసైడ్ అయ్యారు. టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్లో ₹100, మల్టీప్లెక్స్లలో ₹125 తగ్గనున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
News March 22, 2026
కోనసీమ జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఎస్సైలు పోలీస్ సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తులకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.


