News March 8, 2025

GDWL: ఈనెల 31లోగా చేసుకుంటే 25శాతం రాయితీ: కలెక్టర్ 

image

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణను ఈనెల 31లోగా చేసుకుంటే 25% రాయితీ ఉంటుందని.. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ మందిరంలో లేఅవుట్ క్రమబద్ధీకరణపై సమావేశం నిర్వహించారు. LRS కోసం జిల్లాలో 46,739 దరఖాస్తులు స్వీకరించగా 14,241 దరఖాస్తులను L1 అధికారులు పరిశీలించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించారని చెప్పారు.

Similar News

News February 28, 2026

తిరుపతి: మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తిపై కత్తిపోట్లు

image

మద్యంమత్తులో జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యువకుల మధ్య తలెత్తిన వివాదంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమలనగర్‌కు చెందిన కొందరు యువకులు మద్యం మత్తులో గొడవపడ్డారు. దీంతో ఓ యువకుడు తన వద్ద ఉన్న కత్తితో తోటి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు క్షతగాత్రుడిని రుయా ఆసుపత్రికి తరలించారు.

News February 28, 2026

రంగారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పద్మావతి తీర్పునిచ్చినట్లు ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు. 2019లో 17ఏళ్ల బాలికను సైదాబాదాద్‌కు చెందిన బ్యాగరి సంతోష్ (26) ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది.

News February 28, 2026

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 28)

image

1927: భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జననం
1928: విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు జననం
1948: రంగస్థల నటీమణి రాజేశ్వరి పువ్వుల జననం
1963: భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం(ఫొటోలో)
* నేషనల్ సైన్స్ డే
* వరల్డ్ టైలర్స్ డే