News March 8, 2025
నేడు కొత్తగూడెం కోర్టులో లోక్ అదాలత్

ఈనెల 8వ తేదీన (శనివారం) కొత్తగూడెం కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి భానుమతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మీ మీద కానీ, మీకు తెలిసిన వారి మీద కానీ, మీ బంధువుల మీద కానీ ఎటువంటి కేసులు ఉన్నా రాజీ కుదుర్చుకోవడానికి మంచి అవకాశం ఉందని సూచించారు.
Similar News
News March 22, 2026
నంద్యాల: పొంచి ఉన్న ప్రమాదం!

నంద్యాల జిల్లాలో పలు బ్రిడ్జిలు, కల్వర్టుల రక్షణ గోడులు శిథిలావస్థకు చేసుకొని ప్రమాదకరంగా మారాయి. వెలుగోడు మండలం రేగడగూడూరుకు వెళ్లే రహదారిలో అబ్దుల్లాపురం సమీపాన ఉన్న వంకపై ఏర్పాటు చేసిన కల్వర్టుకు సైడ్ వాల్ లేకపోవడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో ఆదమరిస్తే వాహనదారులు ప్రమాదాలకు గురవ్వాల్సిందే. అధికారులు స్పందించి కల్వర్టుపై సైడ్ వాల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
News March 22, 2026
గద్దర్ అవార్డులకు మంత్రి దూరం: రాజకీయ చర్చ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘గద్దర్ సినీ అవార్డుల’ ప్రదానోత్సవానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నగరంలోనే ఉన్నప్పటికీ ఆయన రాకపోవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన శాఖలో మరో నేత జోక్యం పెరగడం లేదా తనను ముఖ్య అతిథిగా కాకుండా విశిష్ట అతిథిగా ఆహ్వానించడంపై ఆయన అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
News March 22, 2026
కడప: సీఐ అశోక్రెడ్డిపై ‘నాన్ బెయిలబుల్’ కేసు..!

గతంలో చిన్నచౌకు, చింతకొమ్మదిన్నె స్టేషన్లలో సీఐగా పనిచేసిన అశోక్రెడ్డిపై నమోదైన నాన్ బెయిలబుల్ కేసు పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆస్తుల సెటిల్మెంట్ల కోసం తనను బెదిరించడమే కాకుండా, రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ అనంతపురానికి చెందిన బాధితుడు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చింతకొమ్మదిన్నె పోలీసులు సీఐపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు.


