News March 8, 2025

జియమ్మవలస: కష్టపడి చదవితే..ఉత్తమ ఫలితాలు

image

విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ అన్నారు. మండలంలోని రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశలో పదో తరగతి కీలక మలుపుతిప్పుందన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్న తపనతో పాఠ్యాంశాలను అవలోకనం చేసుకోవాలని వారికి సూచించారు.

Similar News

News March 10, 2026

కొయ్యలగూడెం: ఈ నెల 25 నుంచి పొగాకు కొనుగోళ్లు

image

ఎన్ఎల్ఎస్ పరిధిలో వర్జీనియా పొగాకు వేలం కొనుగోళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు వేలం నిర్వహణ అధికారి శివకుమార్ తెలిపారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం1,2, దేవరపల్లి, గోపాలపురంలోని ఐదు కేంద్రాల్లో వేలం జరుగుతుందన్నారు. సుమారు 4,816 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్న 2,673 మంది రిజిస్టర్డ్ రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.

News March 10, 2026

గల్ఫ్ యుద్ధం.. నిజామాబాద్ వాసికి గాయాలు

image

గల్ఫ్ యుద్ధం కారణంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి గాయపడ్డారు. కమ్మర్‌పల్లికి చెందిన తిరుపతి ఉపాధి నిమిత్తం ఏడేళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్లారు. ఇటీవల ఆయన విధుల్లో ఉండగా మిస్సైల్ దాడిలో శకలాలు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నారు. తిరుపతిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని కుటుంబీకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

News March 10, 2026

ADB: కోటి మొక్కల సైన్యం.. క్షేత్రస్థాయిలో శూన్యం!

image

2015లో ప్రారంభమైన హరితహారం నుంచి వన మహోత్సవం వరకు మొక్కల పెంపకం అవినీతికి కేంద్రబిందువుగా మారిందనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా కోటికిపైగా మొక్కలు నాటినట్లు అధికారులు గణాంకాలు చూపుతున్నా క్షేత్రస్థాయిలో వాటి ఉనికి లేదు. నిర్మల్- 400 నర్సరీల్లో 50లక్షల మొక్కలు, ADB-468 నర్సరీల్లో 30లక్షలు, ASF-334 నర్సరీల్లో 35లక్షలు, MNCL-311 నర్సరీల్లో 23లక్షల మొక్కలు పెంచుతున్నట్లు చెబుతున్నారు.