News March 8, 2025
మహబూబాబాద్: ‘జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి’

జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ, సెక్రటరీ జిల్లా న్యాయసేవాధికార సంస్థ సురేశ్ కోరారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా, సివిల్, భూతగాదాలు, మోటారు వాహన ప్రమాదాలు, వివాహ, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఎక్సైజ్, కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
Similar News
News July 6, 2025
నిర్మల్ జిల్లాకు భారీ వర్ష సూచన

నిర్మల్ జిల్లాలో ఈనెల 6 నుంచి 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో జిల్లాకు పింక్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు.
News July 6, 2025
‘విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో కొత్త బ్యారక్’

ఏపీలో ఉన్న వివిధ జైళ్లను రూ.103 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జైళ్ల శాఖ ఐజీ డా.ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రూ.10 కోట్లతో 250 మంది సామర్థ్యం గల కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ జైలుని సందర్శించిన ఆయన ఈ మేరకు వివరాలు తెలియజేశారు.
News July 6, 2025
వేంపల్లి: ట్రాక్టర్ ఢీ.. 50 గొర్రెలు మృతి

కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి- తాళ్లపల్లి మధ్యలో ట్రాక్టర్ ఢీకొని 50 గారెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ గొర్రెలు తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వారివిగా గుర్తించారు. వీరంతా తాళ్లపల్లిలో మేపుకోసం వెళ్తున్నారు. అటుగా స్పీడుగా వచ్చిన ట్రాక్టర్ గొర్రెలను ఢీకొనగా అక్కడికక్కడే 50 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.