News March 8, 2025
భార్యను చదువు మానేయమనడం క్రూరత్వమే: హైకోర్టు

అర్ధాంతరంగా భార్యను చదువు మానేయమనడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఇది ఆమె కలలను నాశనం చేయడమేనని పేర్కొంది. ఆమెను చదువుకోకుండా నిర్బంధించడం మానసిక క్రూరత్వమేనని స్పష్టం చేసింది. విడాకులు మంజూరు చేసేందుకు ఇది సరైన కారణమేనని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఇలాంటివారికి విడాకులు ఇవ్వడం సమంజసమేనని తెలిపింది.
Similar News
News April 3, 2026
ఇంట్లో కుండలోని నీటిని తాగుతున్నారా?

వేసవి తాపాన్ని తీర్చే మట్టి కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ శుభ్రత పాటించకపోతే అదే అనారోగ్యానికి దారితీయవచ్చు. మట్టి కుండలో నీరు సురక్షితంగా ఉండేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ‘కొత్త కుండను వాడే ముందు రోజంతా నీటిలో నానబెట్టాలి. రోజూ వేడి నీటితో కడగడం వల్ల బాక్టీరియా చేరదు. కుండను కడిగేందుకు సబ్బు వాడకండి. ఉప్పు లేదా బేకింగ్ సోడాతో మాత్రమే రుద్దడం మేలు’ అని సూచిస్తున్నారు.
News April 3, 2026
టీనేజర్ల ఫిజికల్ రిలేషన్.. కిడ్నాప్ కేసులో బాలుడికి ఊరట

15 ఏళ్ల బాలికతో ఫిజికల్ రిలేషన్ కారణంగా కిడ్నాప్ కేసు ఎదుర్కొంటున్న బాలుడికి ఉత్తరాఖండ్ హైకోర్టు ఉపశమనం కలిగించింది. అతనిపై జువెనైల్ జస్టిస్ బోర్డ్లో జరగాల్సిన విచారణను నిలిపివేసింది. తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని బాలుడిపై తండ్రి కేసు పెట్టారు. అయితే తానే అతడిని ఇంటికి ఆహ్వానించానని, పరస్పర అంగీకారంతోనే సంబంధం కొనసాగించామని బాలిక కోర్టుకు చెప్పింది. దీంతో బాలుడికి కోర్టు కేసు నుంచి ఊరటనిచ్చింది.
News April 3, 2026
‘రామాయణ’ యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతంటే?

‘రామాయణ’ <<19543549>>సినిమా<<>> రెండు పార్టులకు కలిపి రాముడిగా నటిస్తున్న రణ్బీర్ కపూర్ రూ.150కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. రావణుడిగా కనిపించనున్న యశ్ రూ.100కోట్లు, సాయి పల్లవి (సీత) రూ.12కోట్లు, సన్నీ డియోల్(హనుమంతుడు) రూ.40కోట్లు, రవి దూబే (లక్ష్మణుడు) రూ.2-4కోట్లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని రూ.4వేల కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారు.


