News March 8, 2025

అయిజ: రెండు మట్టి టిప్పర్లు పట్టివేత

image

అయిజ పట్టణంలోని కర్నూల్ రాయచూర్ చౌరస్తాలో శుక్రవారం 2 మట్టి టిప్పర్లు పట్టుకున్నట్లు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు అటుగా వెళ్తున్న టిప్పర్లను ఆపి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయానికి తరలించి, తహశీల్దార్ జ్యోతి ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించామన్నారు.

Similar News

News March 5, 2026

అనకాపల్లి: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 461 మంది గైర్హాజర్

image

అనకాపల్లి జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 461 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 6,557 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6,096 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News March 5, 2026

ఖలిస్థానీ విమర్శకురాలు, యూట్యూబర్ దారుణ హత్య

image

ఖలిస్థానీ విమర్శకురాలు, పంజాబ్ సంతతికి చెందిన యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్(45) కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. SMలో యాక్టివ్‌గా ఉండే నాన్సీ ఖలిస్థానీ కార్యకలాపాలను విమర్శిస్తూ వీడియోలు పోస్టు చేసేవారు. తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కామెంట్లనూ ఖండించేవారు. ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 5, 2026

అనంత: పక్కాగా జనగణన

image

అనంతపురం జిల్లాలో 16వ జనగణన కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు మొదటి దశలో హౌస్ లిస్టింగ్ నిర్వహించి ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. డేటా సేకరణలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.