News March 8, 2025
NLG: పోలీసులకు ఎస్పీ అభినందనలు

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్ అయిన బాలుడి కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. కిడ్నాప్ అయిన బాలుడితోపాటు నల్గొండ టూటౌన్ పోలీసులు శుక్రవారం ఎస్పీని కలిశారు. బాలుడిని ఎస్పీ ఎత్తుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును 48 గంటల్లో ఛేదించినందుకు పోలీసులను ప్రశంసించారు.
Similar News
News April 3, 2026
NLG: ధాన్యం పక్కదారి.. మిల్లర్లపై చర్యలేవి?

నల్గొండ జిల్లాలో సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై ఇప్పటికీ కఠిన చర్యలు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. 2022-23 సీజన్కు చెందిన రూ.191.13 కోట్ల విలువైన 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని 7 మిల్లులు దుర్వినియోగం చేసినట్లు తనిఖీల్లో తేలింది. కేసులు నమోదు చేసినప్పటికీ రాజకీయ నాయకుల చొరవతో చర్యలు నెమ్మదిస్తున్నాయి. కేసులో ఇప్పటికే ఒకరు అరెస్ట్ కాగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు.
News April 3, 2026
NLG: నామినేటెడ్ ‘కొలువు’లకై.. ఎదురుచూపులు!

జిల్లాలో అధికార కాంగ్రెస్ శ్రేణుల్లో నామినేటెడ్ పదవుల సందడి నెలకొన్నా, ఆశావహులకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు గడుస్తున్నా, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, కమిటీల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి.. ఇప్పుడు తమకు గుర్తింపు దక్కడం లేదని అంతర్గతంగా మదన పడుతున్నారు.
News April 3, 2026
నల్గొండ: నకిలీ విత్తనాలపై ‘స్పెషల్ ఆపరేషన్’

వానాకాలం సాగు వేళ నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుల ఆట కట్టించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా, ఇందుకోసం సుమారు17 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు గుర్తించారు. విడి విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు త్రిముఖ వ్యూహంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వ్యాపారుల కదలికలపై నిరంతర నిఘా ఉంచనున్నారు.


