News March 8, 2025
విశాఖ: అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే ఆత్మహత్య

అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే చచ్చిపోతున్నా.. అంటూ ఓ మహిళ వాయిస్ మెసేజ్ కలకలం సృష్టించింది. కొబ్బరి తోటకు చెందిన ధనలక్ష్మి వద్ద సుగుణ అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య వివాదం జరగ్గా ధనలక్ష్మి, ఆమె కుమారుడు సుగుణతో గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన సుగుణ.. గురువారం ధనలక్ష్మి ఇంటికి వెళ్లి రూమ్లో తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సుగుణ బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.
Similar News
News March 27, 2026
విశాఖ: గ్యాస్ బుకింగ్ చేస్తే 8 రోజులు వెయిటింగ్

విశాఖ జిల్లాలో HPCL, BPCL, IOCL కలిపి 62 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. సుమారు 8.50 లక్షల గృహ వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 22 వేలకుపైగా సిలిండర్లు ఏజెన్సీలకు పంపిణీ చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇంకా 1.70 లక్షల మంది వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు. రోజుకు 20 వేల సిలిండర్లు సరఫరా చేసినా పెండింగ్ పూర్తిగా క్లియర్ కావడానికి కనీసం 8 రోజులు పట్టే పరిస్థితి నెలకొంది.
News March 27, 2026
విశాఖ: గ్యాస్ బుకింగ్ చేస్తే 8 రోజులు వెయిటింగ్

విశాఖ జిల్లాలో HPCL, BPCL, IOCL కలిపి 62 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. సుమారు 8.50 లక్షల గృహ వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 22 వేలకుపైగా సిలిండర్లు ఏజెన్సీలకు పంపిణీ చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇంకా 1.70 లక్షల మంది వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు. రోజుకు 20 వేల సిలిండర్లు సరఫరా చేసినా పెండింగ్ పూర్తిగా క్లియర్ కావడానికి కనీసం 8 రోజులు పట్టే పరిస్థితి నెలకొంది.
News March 27, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్

విశాఖపట్నం నుంచి శుక్రవారం బయలుదేరాల్సిన 20830 వందే భారత్ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్ అయింది. అనుసంధాన రైలు ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 2:50 గంటలకు బదులుగా, సాయంత్రం 4:40 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గమనించి ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.


