News March 8, 2025
మంచిర్యాలలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 29 ఉంటుందని, తెలుపు రంగు ఫుల్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జీఆర్పీ ఎస్ఐ మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658596, 9849058691 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News September 17, 2025
కామారెడ్డి: వరద సహాయక చర్యల్లో పోలీసుల అద్భుత ప్రతిభ

ఇటీవల KMR జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 800 మందికి పైగా ప్రజలను త్వరితగతిన రక్షించిన పోలీసు శాఖ ధైర్య సాహసాలను రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ప్రశంసించారు. కామారెడ్డిలో బుధవారం జరిగిన ప్రజాపాలన వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జిల్లాను నేర రహిత సమాజంగా మార్చడానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరి సహకారం అవసరమని ఆయన కోరారు.
News September 17, 2025
స్వాతంత్య్ర పోరాటంతో RSSకు సంబంధం లేదు: బృందాకారత్

భారత స్వాతంత్ర్య పోరాటంతో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పష్టం చేశారు. నల్గొండలో జరుగుతున్న వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
News September 17, 2025
కామారెడ్డి: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి: కోదండరెడ్డి

కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిన చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.