News March 23, 2024

NLG: జిల్లాలో 5.11 లక్షల పశువులకు టీకాలు

image

పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామని NLG జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి డాక్టర్ అంబటి యాదగిరి తెలిపారు. జిల్లాలో సుమారు 2లక్షల తెల్లపశువులు, 3.11 లక్ష నల్లజాతి పశువులకు టీకాలను వేయడానికి 74 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏప్రిల్ 15 వరకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

Similar News

News April 20, 2025

NLG: కమ్మని కల్లు.. మనసు జిల్లు!

image

ఈ ఏడాది జిల్లాలో కల్లుకు డిమాండ్‌ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలు పెంచడంతో ఎక్కువ మంది కల్లు కిక్కును కోరుకుంటున్నారు. ప్రస్తుతం తాటి కల్లు సీజన్‌ కావడంతో మందుబాబులు ఆ మత్తు పానీయం కోసం పరుగులు తీస్తున్నారు. ధర తక్కువ కావడంతో పేదలు, కూలీలు దీనిని సేవిస్తుంటారు. జిల్లాలో చాలాచోట్ల కల్లు ధరలు పెరిగినా ఆరోగ్యానికి మంచిది కావడంతో చాలామంది కల్లువైపే ఆసక్తి చూపుతున్నారు.

News April 20, 2025

NLG: కమ్మని కల్లు.. మనసు జిల్లు!

image

ఈ ఏడాది జిల్లాలో కల్లుకు డిమాండ్‌ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలు పెంచడంతో ఎక్కువ మంది కల్లు కిక్కును కోరుకుంటున్నారు. ప్రస్తుతం తాటి కల్లు సీజన్‌ కావడంతో మందుబాబులు ఆ మత్తు పానీయం కోసం పరుగులు తీస్తున్నారు. ధర తక్కువ కావడంతో పేదలు, కూలీలు దీనిని సేవిస్తుంటారు. జిల్లాలో చాలాచోట్ల కల్లు ధరలు పెరిగినా ఆరోగ్యానికి మంచిది కావడంతో చాలామంది కల్లువైపే ఆసక్తి చూపుతున్నారు.

News April 20, 2025

NLG: మన పనుల్లో ఉత్తరాది కూలీలు..!

image

ఉమ్మడి NLG జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు గణనీయంగా పెరిగారు. ప్రతి రంగంలో వారి ఉనికి కనిపిస్తోంది. సుమారు 6వేల మంది వరకు కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు అంచనా. హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం, ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా బీహార్, UP, ఢిల్లీ వాళ్లు పని చేస్తున్నారు.

error: Content is protected !!