News March 8, 2025

వరంగల్‌లో KCR భారీ బహిరంగ సభ

image

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్‌ను పరిశీలించారు.

Similar News

News April 18, 2026

చిత్తూరు: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

image

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.

News April 18, 2026

GNT: జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఉద్యోగాలు

image

గుంటూరు జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, ఆప్టోమెట్రిస్ట్, DDM/MIS, NHM, ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, టీబీ హెల్త్ విజిటర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని వివరాలకు www.guntur.nic.in సైట్‌ను సందర్శించాలన్నారు.

News April 18, 2026

సత్యసాయి: కార్లు అద్దెకు తీసుకొని మోసం.. నిందితుడి అరెస్ట్

image

కార్లను బాడుగకు తీసుకొని, యజమానులకు తెలియకుండా కుదువ పెట్టి మోసం చేసిన అన్నవరం గౌతం రాజును సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు యజమానులను నమ్మించి మూడు కార్లు తీసుకొని, వాటిని ఇతరుల వద్ద కుదువ పెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.