News March 8, 2025
వరంగల్లో KCR భారీ బహిరంగ సభ

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్ను పరిశీలించారు.
Similar News
News September 19, 2025
పెద్దపల్లి: బాలల భవిష్యత్తుకు ఆరోగ్య భద్రతా కవచం DEIC

PDPL జిల్లా ఆసుపత్రిలో 2024లో స్థాపించిన DEIC పిల్లల ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద 18ఏళ్ల లోపు పిల్లలకు ముందస్తు గుర్తింపు, రిఫెరల్, సమగ్రసేవలు అందిస్తోంది. వైద్య, డెంటల్, ఆడియోలజీ, స్పీచ్, సైకాలజీ, విజన్, స్పెషల్ ఎడ్యుకేటర్ సేవలందిస్తూ ఇప్పటివరకు 1,881ప్రత్యేక విద్య,1,469డెంటల్,1,499 ఆడియోలజీ,1,824సైకాలజీ,1,002 ఆప్టోమెట్రీ కేసులను పరిష్కరించింది.
News September 19, 2025
సిర్పూర్(టి): పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి

సిర్పూర్ (టి) మండలం లోనవెల్లి గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు ఈరోజు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,770 నగదు, 52 పేక మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. పేకాట వంటి అనైతిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 19, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రాష్ట్ర స్థాయి క్రీడలకు పాలకుర్తి విద్యార్థి ఎంపిక
> జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు
> యూరియా నిల్వలను పరిశీలించిన అదనపు కలెక్టర్
> కడియం రాజీనామా చేయాలని ఉత్తరాల ఉద్యమం
> రఘునాథపల్లిలో గంజాయి పట్టివేత
> అలుగు పోస్తున్న బొమ్మెర చెరువు
> జనగామ: ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
> USAలో బతుకమ్మ పండగకు మంత్రులకు ఆహ్వానం
> 30 లోపు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్