News March 8, 2025
భీమిని: హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు

భీమిని మండలంలోని జగ్గయ్యపేట ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం రేగుచెట్టు రమేశ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆరోపణలు నిజమని తేలడంతో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News January 13, 2026
HYD: హైడ్రా వారి జోలికి వెళ్లదు..!

నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని మరోసారి స్పష్టం చేసింది. 2024 జులైలో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన ఇళ్లను తొలగించకూడదని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ నిబంధన అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పేర్కొంది. చట్టం ప్రకారం హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని పేర్కొంది. నిన్న హైడ్రా ప్రజావాణికి 76 ఫిర్యాదులు అందాయి.
News January 13, 2026
చర్మం పొడిబారి రాలుతోందా?

శీతాకాలం మొదలైతే చాలు చర్మం పొడిబారడం, ఎండిపోయి జీవం కోల్పోయినట్టుగా ఉండటం చాలామందిలో కనిపించే సమస్య. చర్మం బాగా పగిలిపోతే కలబంద రాయాలి. ఇది చర్మానికి చల్లదనం ఇవ్వడమే కాదు.. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దురద, నొప్పిని తగ్గిస్తాయి. ఆలివ్ నూనె సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. కొబ్బరి, జొజోబా నూనెలను సమపాళ్లలో తీసుకొని దానికి కొన్నిచుక్కల టీట్రీ ఆయిల్ కలిపి చర్మానికి రాయాలి.
News January 13, 2026
సంగారెడ్డి: GREAT.. జిల్లా వాసికి ప్రిడ్ భారతరత్న అవార్డ్

HYD రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన వినాయక్ పవర్కు ప్రతిష్టాత్మక ప్రిడ్ భారతరత్న అవార్డు-2026 లభించింది. వల్లూరి ఫౌండేషన్, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేశారు. 2020-2025 మధ్య ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ ఛైర్మన్గా ఆయన అందిస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.


