News March 23, 2024

KTDM: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: జిల్లా ఎస్పీ

image

మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు  ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ముందస్తుగా సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచారు. కొత్తగూడెం, భద్రాచలం,ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అధికంగా ఉన్నాయని.. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాల సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News July 8, 2024

నీటి ప్రవాహానికి ఊపిరాడక వాహనదారుడు మృతి

image

మధిర శివాలయం వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైరా నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి మడుపల్లి గ్రామానికి ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రోడ్డు కుంగి తూములో ఇరుక్కున్నాడు. దీంతో నీటి ప్రవాహానికి ఊపిరాడక అతడు మృతి చెందాడు. మృతుడు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన బోశెట్టి రమేష్‌‌గా పోలీసులు గుర్తించారు. 

News July 8, 2024

ఖమ్మం జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు

image

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.

News July 8, 2024

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.