News March 23, 2024
రైతుబంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
TG: రైతుబంధు(రైతుభరోసా) ఆర్థిక సాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీజన్కు ముందు కాకుండా మధ్యలో లేదా చివర్లో డబ్బులు జమ చేయాలని యోచిస్తోంది. అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందనేది సర్కార్ ఆలోచన. అది కూడా ఐదెకరాలలోపు రైతులకే అందించనున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 6, 2024
ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా?: CM
TG: 20ఏళ్లుగా పేదల్లో ఉన్న తనకు పేదోడి దుఃఖం తెలియదా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా? ZP మెంబర్ నుంచి సీఎం అయ్యాను. వాళ్లందర్నీ ఎలా ఆదుకోవాలో చెప్పండి. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు చేసింది. పేదల కోసం మరో రూ.10వేల కోట్లు అప్పు చేద్దాం. KCRకు 1000ఎకరాల ఫామ్హౌస్ ఉంది. BRS ఖాతాలో రూ.1500కోట్లున్నాయి. అదంతా పేదల డబ్బే’ అని రేవంత్ అన్నారు.
News October 6, 2024
ఈరోజు మయాంక్కి చోటివ్వాల్సిందే: ఆకాశ్ చోప్రా
బంగ్లాదేశ్తో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత ప్లేయింగ్ లెవన్లో మయాంక్ యాదవ్ను ఆడించాల్సిందేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. ‘మయాంక్ లాంటి ఫాస్ట్ బౌలర్ను స్క్వాడ్లోకి తీసుకుంటే కచ్చితంగా ఆడించాల్సిందే. తన ఫస్ట్ క్లాస్ మ్యాచుల రికార్డును పట్టించుకోకుండా జాతీయ జట్టుకి తీసుకున్నారు. అలాంటప్పుడు అతడికి అవకాశం ఇవ్వాల్సిందే. కత్తిని కొనేది దాచుకునేందుకు కాదుగా?’ అని ప్రశ్నించారు.
News October 6, 2024
90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చాం: CM రేవంత్
TG: గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్కు అండగా నిలిచి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్తగా నియమితులైన ఇంజినీర్లకు హైదరాబాద్లోని శిల్పారామంలో సీఎం నియామకపత్రాలు అందించారు. ఉద్యోగుల కళ్లలో సంతోషం చూడాలనే దసరాకు ముందు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.