News March 23, 2024
కాకినాడ: జంటహత్యల కేసులో నిందితుడి అరెస్టు
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో జంట హత్యల కేసులో నిందితుడైన లోకా నాగరాజును అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపర్చినట్లు పిఠాపురం CI శ్రీనివాస్ తెలిపారు. బుధవారం అదే గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాస్, పెండ్యాల లోవాలపై పొలంలోనే నాగబాబు కత్తితో దాడి చేసి, హత్య చేశాడన్నారు. అనంతరం లోవ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించాడని CI పేర్కొన్నారు.
Similar News
News July 8, 2024
ఎమర్జెన్సీని తలపించిన YCP పాలన: పురందీశ్వరి
ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలన ఎమర్జెన్సీ కాలంనాటి రోజులను తలపించిందని బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించే ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని పురందీశ్వరి అన్నారు.
News July 8, 2024
పవన్ కళ్యాణ్కు మాటిచ్చి.. రంగంలోకి కలెక్టర్
సమస్యల పరిష్కారం నిమిత్తం 2 వారాలకొకసారి కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ స్వయంగా పిఠాపురంలో అందుబాటులో ఉంటానని ముందుకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ సభా వేదికపై వెల్లడించిన విషయం తెలిసిందే. పవన్కు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ షాన్మోహన్ సోమవారం పిఠాపురం విచ్చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
News July 8, 2024
కాకినాడ: BJP గూటికి ఇద్దరు మాజీ కార్పొరేటర్లు
కాకినాడకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు గోడి సత్యవతి, గరిమెళ్ల శర్మ బీజేపీ గూటికి చేరారు. గోడి సత్యవతి భర్త వెంకట్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో BJPలో ఉన్న వీరు YCPలో చేరారు. తిరిగి ఆదివారం సొంతగూటికి రాగా.. బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి MP పురందీశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.