News March 23, 2024

అరసవిల్లి ఆలయ ప్రాంగణంలో వృద్ధుడి మృతి

image

నరసన్నపేటలోని మారుతీనగర్‌కు చెందిన ఉదండ్రావు వెంకట భాస్కరరావు(70) భార్య కృష్ణవేణితో కలిసి శుక్రవారం అరసవల్లి ఆలయానికి వచ్చారు. సెల్‌ఫోన్ డిపాజిట్ చేసి స్వామి దర్శనానికి క్యూలైనులోకి వెళ్లగా.. గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఆ వాహనం వచ్చేలోగా ఆర్ఎంపీ వైద్యుడిని పిలిచి చూపించగా.. అప్పటికే భాస్కరరావు మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News December 27, 2025

SKLM: నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ సూచనలు

image

న్యూఇయర్, సంక్రాంతి, రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా శనివారం రాత్రి శ్రీకాకుళంలో పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలో నేరాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షణలో ముందుండాలని అధికారులకు సూచించారు.

News December 27, 2025

శ్రీకాకుళం: ఎస్పీకి దువ్వాడ ఫిర్యాదు

image

జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డిని శనివారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. తాజాగా తనపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎస్పీకి దువ్వాడ వివరించారు. గతంలో కూడా తనపై దాడి చేస్తామని బెదిరిస్తూ కాల్స్ చేశారని అప్పుడు కూడా పోలీసులకు పిర్యాదు చేసినట్లు దువ్వాడ తెలిపారు. దీనిపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.

News December 27, 2025

31నే ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా జనవరి 1న పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ, నూతన సంవత్సరం దృష్ట్యా అవ్వాతాతలకు ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి నిర్ణయించిందని పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ ఈ మార్పును గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.