News March 8, 2025

స్విమ్స్‌లో ఖాళీ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

image

తిరుపతి స్విమ్స్‌లో వివిధ క్యాటగిరీల్లో సీనియర్ రెసిడెన్స్ వైద్యుల వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రిజిస్టర్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల తెలిపారు. 20 విభాగాల్లో 38 పోస్టులకు ఈనెల 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు పాత డైరెక్టర్ కార్యాలయం కమిటీ హాలులో జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు https://svimstpt.ap.nic.inను సంప్రదించాలని కోరారు.

Similar News

News November 7, 2025

సబ్బవరం: ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

సబ్బవరంలోని ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామచంద్ర రావు తెలిపారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి.వీరబాబు (19)గా గుర్తించారు. గురువారం వీరబాబు డిఫెన్స్ అకాడమీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News November 7, 2025

నేడు సామూహిక ‘వందేమాతరం’ గీతాలాపన

image

వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు సామూహిక గీతాలాపన చేయాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ సముదాయంలో ఉదయం 10 గంటలకు సామూహిక వందేమాతరం గీతాలాపన జరుగుతుందని ఆయన ప్రకటించారు.

News November 7, 2025

ORRకు NTR జిల్లాలో భూసేకరణ పూర్తి.. ఆ మండలాల మీదుగానే.!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి NTR జిల్లాలో భూసేకరణ పూర్తి చేశారు. మైలవరం, G.కొండూరు, వీరులపాడు, కంచికచర్ల మండలాల పరిధిలో 18 గ్రామాల మీదుగా సుమారు 51 K.M పరిధిలో ORR నిర్మాణం కానుంది. జిల్లాలో 3,300 ఎకరాల భూమిని సేకరించి వాటి వివరాలు NH అధికారులకు అధికారులు పంపారు. త్వరలో సేకరించనున్న భూముల వివరాలు, కంపెన్సేషన్ తెలుపుతూ గెజిట్ విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.