News March 9, 2025

కేంద్రమంత్రితో పరిశ్రమల భూమిపూజలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

image

పరిశ్రమలను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో రూ. 3,225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న 4 ప్లాంట్లకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు. అమరరాజా గిగా ఫ్యాక్టరీ -1, ఆల్టిమిన్, లోహమ్ మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు భూమిపూజ జరిగింది.

Similar News

News March 7, 2026

ప్రగతి ప్రణాళికలో వైద్య సేవలను బలోపేతం చేయాలి: కలెక్టర్

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో భద్రాద్రి కలెక్టర్ అంకిత్ కలిసి వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు మొత్తం 99 రోజులపాటు చేపట్టనున్న కార్యాచరణపై కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 7, 2026

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ: డీఐజీ

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జనవరి 1 నుంచి ఈనెల 6 వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఓవర్ స్పీడ్ 1,763 కేసులు, హెల్మెట్ లేకుండా 1,590, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 421, డ్రంక్ అండ్ డ్రైవింగ్ 1,538, ఓపెన్ డ్రింకింగ్ కేసులు 2,928 నమోదు చేసినట్లు తెలిపారు.

News March 7, 2026

సింగరేణి సీఎండీని కలిసిన భద్రాద్రి కలెక్టర్ అంకిత్

image

భద్రాద్రి కలెక్టర్ అంకిత్ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సీఎండీ డా.జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, పరస్పర సహకారంపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ కూడా పాల్గొన్నారు.