News March 9, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,68,080 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,23,314 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.99,330, అన్నదానానికి రూ.45,436 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News January 9, 2026
తూ.గో: హోటళ్లు, రిసార్టులు హౌస్ఫుల్

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి తరలివస్తున్న అతిథులతో సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి 18 వరకు హోటళ్లు, రిసార్టులు ఇప్పటికే నిండిపోయాయి. కోడిపందాలు, పడవ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలకు ప్రముఖులు హాజరవుతున్నారు. అతిథుల మర్యాదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 9, 2026
గర్భాశయ రక్తస్రావం గురించి తెలుసా?

మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వయస్సుతో పాటు అనేక గర్భాశయ సంబంధిత సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిల్లో ఒకటే గర్భాశయ రక్తస్రావం. పీరియడ్స్లో అధిక రక్తస్రావం, పీరియడ్స్ మధ్య స్పాటింగ్, సంభోగం తర్వాత రక్తస్రావం ఉన్నా గర్భాశయ రక్తస్రావం అంటారు. ఇది ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, PCOS, థైరాయిడ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News January 9, 2026
సిద్దిపేట: 11వ శతాబ్దపు గణపతి విగ్రహం లభ్యం

సిద్దిపేట జిల్లా మద్దూరు మం. వల్లంపట్లలో పురాతన గణపతి విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు మహేశ్ గుర్తించారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ 5 అడుగుల చతుర్భుజ గణపతి శిల్పం లలితాసనంలో ఎంతో ప్రత్యేకంగా ఉంది. పరహస్తాలలో పరశువు, పుష్పం, నిజ హస్తాలలో విరిగిన దంతం కలిగి ఉన్న ఈ విగ్రహం కళాత్మకతకు నిదర్శనమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆలయ పునర్నిర్మాణ సమయంలో ఈ చారిత్రక సంపద వెలుగులోకి వచ్చింది.


