News March 9, 2025

HYD: 10 జాతీయ రహదారులు పూర్తి: కేంద్ర మంత్రి

image

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

కామారెడ్డి: మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అజహరుద్దీన్

image

మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మైనార్టీ శాఖ మంత్రి అజహరుద్దీన్‌ను నియమించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతను అజహరుద్దీన్‌కు అప్పగించారు.

News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలు.. మంత్రులకు ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతలు

image

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా CM రేవంత్ నియమించారు. NZB-ఉత్తమ్, మల్కాజిగిరి-కోమటిరెడ్డి, KNR-తుమ్మల, నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్, WGL-పొంగులేటి, చేవెళ్ల-శ్రీధర్ బాబు, KMM-సురేఖ, మహబూబాబాద్-పొన్నం, MBNR-దామోదర, జహీరాబాద్-అజహరుద్దీన్, MDK-వివేక్, నాగర్ కర్నూల్-వాకిటి శ్రీహరి, భువనగిరి-సీతక్క, PDPL-జూపల్లి, ADB-సుదర్శన్ రెడ్డి(ప్రభుత్వ సలహాదారు)

News January 19, 2026

మీరు చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు

image

కొందరు తల్లిదండ్రులు మా పిల్లలకు ఏం చెబుతున్నా చెయ్యట్లేదు. మాట వినట్లేదు అని బాధపడుతుంటారు. కానీ పెద్దలను చూసే పిల్లలు ఏదైనా పాటిస్తారంటున్నారు నిపుణులు. మనం తీసుకొనే ఆహారం నుంచి వ్యాయామం వరకు వాళ్లు చూసే నేర్చుకుంటారు. సానుకూలంగా ఆలోచించడం, క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం పేరెంట్స్‌ని చూసే నేర్చుకుంటారు. అలాగే వారి మాటలను శ్రద్ధగా వింటేనే తమ మనసులోని మాటలు స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.