News March 9, 2025
HYD: 10 జాతీయ రహదారులు పూర్తి: కేంద్ర మంత్రి

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(<
News December 30, 2025
KMR: ‘ఎగిరే గాలిపటం.. తీయొద్దు ప్రాణం’

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహం ఇతరుల ప్రాణాల మీదకు రాకూడదని KMR ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలను కోరారు. గత సంక్రాంతి సీజన్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 65 బెండల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
News December 30, 2025
మేడారంలోనే ఎస్పీ కేకన్ అడ్డా

మేడారం జాతరలోనే జిల్లా అధికారులు మకాం పెట్టారు. ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్ స్వయంగా మేడారంలోనే తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎస్పీ, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రోడ్ల మరమ్మతు జరుగుతుండటంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరగకుండా పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా, వణుకుతూనే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


