News March 9, 2025
సంగారెడ్డి: లోక్ అదాలత్లో 14,3 07 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్లో 14,307 కేసులు పరిష్కరించినట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. కొన్ని కేసుల్లో నష్టపరిహారం కూడా ఇప్పించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
పెద్దపల్లి బీజేపీ జిల్లా కమిటీని ప్రకటించిన జిల్లా అధ్యక్షుడు

పెద్దపల్లి జిల్లా బీజేపీ కమిటీని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులుగా జూలపల్లి మండలానికి చెందిన సీనియర్ నాయకుడు అమరగాని ప్రదీప్ కుమార్, భాస్కర్ రెడ్డి, శనిగరపు రమేష్, చౌదరి మహేందర్, మాచగిరి రాము, కాసగోని నిర్మలలను ఆయన నియమించారు. అలాగే జిల్లా సెక్రటరీలను, సోషల్ మీడియా పలు కమిటీలను నియమించారు.
News September 17, 2025
వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 128.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖిల్లా వరంగల్ మండలంలో అత్యధికంగా 27.8 మి.మీ వర్షం పడగా, గీసుగొండ 18, వరంగల్ 15.8 వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 9.9 మి.మీగా నమోదైంది.
News September 17, 2025
పండగ ఆఫర్ల పేరుతో మోసాలు: ఎస్పీ

పండగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఇచ్చే తప్పుడు ప్రకటనలను నమ్మొద్దని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. తక్కువ ధరకే లభించే వస్తువుల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల కాల్స్, మెసేజ్లు, ఈమెయిళ్లకు స్పందించవద్దని, సులభంగా డబ్బులు సంపాదించే ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని కోరారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.