News March 9, 2025
NRPT: లోక్ అదాలత్ లో 9,825 కేసులు పరిష్కారం

నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 9,825 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. కేసులలో రాజీ అయిన వారికి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ. 24,08,020 ఆదాయం లభించిందని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని చెప్పారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 10, 2025
మాంసాహారం తింటున్నారా.. ఈ విషయంలో జాగ్రత్త!

పెరుగుతో గుడ్డు, మాంసాహారం కలిపి తినడం మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు. అది నిజమేనంటున్నారు పోషకాహార నిపుణులు. మాంసాహారం, పాల పదార్థాలను వెనువెంటనే తినకూడదని, తింటే జీర్ణ, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక నాన్ వెజ్ తిన్న తర్వాత టీ తాగితే గుండెల్లో మంట రావొచ్చంటున్నారు. అలాగే మటన్ తర్వాత తేనె తీసుకుంటే ఒంట్లో ఉష్ణం పెరిగిపోతుందని, అది కూడా నివారించాలని సూచిస్తున్నారు.
News March 10, 2025
నల్గొండ: ఎమ్మెల్సీ సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖరారు

శాసనమండలి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. ఈ మేరకు హైదరాబాద్ మఖ్దూంభవన్లో ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10.00 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
News March 10, 2025
నల్గొండ: 2023లో టికెట్ త్యాగం.. నేడు ఎమ్మెల్సీగా అవకాశం

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్ గ్రామానికి చెందిన అద్దంకి దయాకర్ అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అద్దంకి దయాకర్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ,2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ను త్యాగం చేశారు. 4 ఏప్రిల్ 1972వ సంవత్సరంలో అద్దంకి జన్మించారు.