News March 9, 2025
భద్రాద్రి: గిరిజనుల వంట రుచి చూసిన ఎమ్మెల్యే, కలెక్టర్

దుమ్ముగూడెం మండలం బొజ్జుగుప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పాల్గొన్నారు. మహిళ అధికారులు, మహిళ సంఘాలు, విద్యార్థులు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన మహిళ కళాబృందంచే నృత్య ప్రదర్శనలు, గిరిజన పండ్లు, పాలపండ్లు, రాగి జావ, జొన్న జావ, తేనే రుచి చూశారు.
Similar News
News March 23, 2026
నిజామాబాద్: మూడు నెలల రేషన్ ఒకేసారి!

ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో ప్రతి నెలా కార్డుదారులు ఎండలో వరుస కట్టాల్సిన ఇబ్బందులు కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు.
ఇందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని సుమారు 15,94,782 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
News March 23, 2026
యుద్ధానికి కావాల్సినంత డబ్బుంది: బెస్సెంట్

ఇరాన్పై యుద్ధాన్ని కొనసాగించేందుకు అమెరికా వద్ద కావాల్సినంత డబ్బు ఉందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ట్రంప్ తన అధికార పరిధిలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని సమర్థించారు. యుద్ధం కోసం అదనంగా కేటాయిస్తున్న నిధులు కేవలం ఎక్స్ట్రా మాత్రమేనని.. అసలు పోరాటానికి సరిపడా డబ్బు ఇప్పటికే ఉందని తెలిపారు. ఇరాన్ విషయంలో ప్రస్తుతానికి అన్ని ఆప్షన్లు రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు.
News March 23, 2026
బాపట్ల: ‘గ్యాస్ కొరత’ కట్టెల పొయ్యిలే దిక్కు..!

యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు. వంట గ్యాస్ దొరకకపోవడంతో జిల్లాలో పలు హోటల్స్, టీ స్టాళ్లు, బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. కట్టెల పొయ్యిలతో ఇబ్బందుల వల్ల వ్యాపారాలు చేయలేక దుకాణాలను మూయాల్సి వస్తోందంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే గ్యాస్ కష్టాలతో పాటు పెట్రోల్ కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.


