News March 9, 2025
నెల్లూరు : మాజీ ఛైర్మన్ ఇక లేరు

నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్, కొచ్చిన్, గోవా పోర్టు ట్రస్ట్ మాజీ సభ్యులు పత్తి రవీంద్రబాబు అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయన పలు పదవులను పొంది పలువురి మన్ననలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Similar News
News March 2, 2026
నెల్లూరు: నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు నర్సింగ్ హోమ్ కరస్పాండెంట్ ప్రభుదాసు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NEET-UG పరీక్షకు హాజరై ఉంటే సరిపోతుందన్నారు. మార్చి 8వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే తమ కాలేజీని సంప్రదించాలన్నారు.
News March 2, 2026
నెల్లూరు కిమ్స్కు 9మంది చిన్నారుల తరలింపు

నెల్లూరు జిల్లా ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పందించారు. 9మంది చిన్నారులను కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటించారు. ఆ ఏరియాలో ఎలాంటి కాంటామినేషన్ లేకుండా చర్యలు తీసుకువాలని ఆదేశించారు. తిరుపతి నుంచి ఫోరెన్సిక్ టీంను పిలిపించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.
News March 2, 2026
నెల్లూరు: ఒక్క రోజులోనే రూ.వెయ్యి తగ్గింపు

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి కాలం కావడంతో జనవరి నుంచి ఫిబ్రవరి ప్రారంభం వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఎండలు పెరగడంతో ధరల్లో ఊపు వచ్చింది. ఒక్కో బస్తాను రూ.7వేల వరకు విక్రయించారు. హోలీ కారణంగా ఉత్తరాధి రాష్ట్రాల్లోని మార్కెట్లకు వారం రోజులు సెలవు ప్రకటించారు. దీంతో నిమ్మ బస్తా ధర ఒక్కరోజులోనే రూ.వెయ్యి పడిపోయింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.5500 వరకు విక్రయిస్తున్నారు.


