News March 9, 2025
అయినవిల్లి: ఆకట్టుకున్న తల్లీకొడుకుల డ్రాయింగ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న డ్రాయింగ్ టీచర్ వేసిన డ్రాయింగ్ పలువురిని ఆకట్టుకుంది. అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో ఉన్న శ్రీఉమామహేశ్వర జిల్లా పరిషత్ హైస్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న జి.సత్యనారాయణ మహిళా దినోత్సవం సందర్భంగా డ్రాయింగ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News November 14, 2025
పర్యావరణ పరిరక్షణలో నేను సైతం అంటున్న ఆర్టీసీ

మహానగరంలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. గాలిలో వాయు నాణ్యతా క్షీణించిపోతోంది. అందుకే ఆర్టీసీ తన వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతూ ప్రయాణికులకు సేవలందిస్తోంది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 275 ఈ-బస్సులు తిరుగుతున్నాయి. మరో రెండేళ్లలో వీటి సంఖ్యను 3000కు పెంచి ఇంధన బస్సు సర్వీసులను నిలిపివేయనుంది. ఈ ఏడాది మరో 300 ఈ బస్సులు సిటీకి రానున్నాయి.
News November 14, 2025
MEOలకు షోకాజ్ నోటీసులు జారీ చేయండి: కలెక్టర్

ముసునూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు MEOలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి జిల్లా విద్యాశాఖ అధికారులను శుక్రవారం ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా మండలాలలోని పాఠశాలలపై సక్రమమైన పర్యవేక్షణ, తనిఖీలు లేనందున వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నట్లు చెప్పారు. విధుల పట్ల ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 14, 2025
సిరిసిల్ల: గైనకాలజిస్ట్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలి: కలెక్టర్

సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టును వెంటనే భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, డీఎంహెచ్ఓ రజిత పాల్గొన్నారు.


