News March 9, 2025

రాజాం: వాల్ పిన్ మింగేసిన బాలుడు

image

ఏడాది వయసున్న బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ సైకిల్ ట్యూబ్ వాల్ పిన్ మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. బాలుడు ఏడుస్తూ అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఓ హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్ ఎండోస్కోపి ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న వాల్ పిన్ జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News March 10, 2025

ఇక నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం: VZM SP

image

విజయనగరం జిల్లాలో MLC ఎన్నికల కోడ్ ముగియడంతో ఇకపై యథావిధిగా ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వవచ్చన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

News March 9, 2025

రాజాం: ఎమ్మెల్సీ అభ్యర్థిగా కావలి గ్రీష్మ

image

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఆదివారం ప్రకటించింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ కుమార్తె గ్రీష్మ. ప్రస్తుతం ఈమె ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు.

News March 9, 2025

VZM: రేపటి నుంచి PGRS ప్రారంభం

image

సోమవారం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PVGR) కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో గత కొన్ని వారాలుగా పిజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో సోమవారం నుంచి యథావిధిగా గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలన్నారు.

error: Content is protected !!