News March 9, 2025

భువనగిరి: పగలు అలా.. రాత్రి ఇలా..

image

భువనగిరి జిల్లాలో రాత్రి చలి వణికిస్తుంటే ఉదయం 9 అయిందంటే చాలు ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో భారీ తేడా కనిపిస్తోంది. పోచంపల్లిలో పగటి ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలు నమోదైతే, రాత్రి 15.6 డిగ్రీలు నమోదైంది. బొమ్మలరామారంలో పగలు 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైదే, రాత్రి 13 డిగ్రీలకు పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Similar News

News March 16, 2026

ADB: భట్టి పద్దు.. జిల్లా ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..?

image

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ADB జిల్లా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. ప్రాణహిత-చేవెళ్ల పనులకు భట్టి పద్దులో ప్రాధాన్యం దక్కుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టు, పెద్దవాగు పూర్తికి నిధులు అవసరమున్నాయి. చనాక-కోరాట, పింపల్‌కాడ్, కుఫ్టీ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే సాగునీటి కల సాకారమవుతుంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వారు కోరుతున్నారు.

News March 16, 2026

హనుమకొండలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలకు హనుమకొండ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-7 నుంచి అండర్-15 విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.

News March 16, 2026

కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

image

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.