News March 9, 2025

రూ.40వేల కోట్లతో అమరావతి పునర్నిర్మాణం

image

AP: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఈ నెల 12-15 మధ్య అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానున్నాయి. ₹48వేల కోట్లతో 73 పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. వీటిలో ₹40వేల కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు పిలవగా, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఏజెన్సీలు ఖరారయ్యాయి. రేపటి సమీక్షలో సీఎం CBN వీటికి ఆమోదముద్ర వేయనున్నారు. ఈ పనుల కోసం వరల్డ్ బ్యాంక్, ADB, హడ్కోల ద్వారా GOVT ₹31వేల కోట్ల రుణం తీసుకోనుంది.

Similar News

News November 7, 2025

చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

image

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

News November 7, 2025

హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

image

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.

News November 7, 2025

SBI అరుదైన ఘనత

image

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.