News March 9, 2025

గొల్లప్రోలు: ఆ వ్యక్తి ఎవరు?

image

గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డులో పోలవరం కాలువ చెంతన గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటనపై దర్యాప్తు కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్డులో వ్యక్తి మరణించి ఉండగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. పోలీసులకు ఆరు రోజులైనా ఎలాంచి క్లూ లభించలేదు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఏ ఊరు వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి వదిలివేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 18, 2026

గజ్వేల్: భూసార పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చేనా..?

image

గజ్వేల్ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని 2023 అక్టోబరులో గత ప్రభుత్వంలో హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే దీనికి ఇప్పటికీ సిబ్బంది నియామకం, ల్యాబ్ పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, తమ భూములను పరీక్షించుకునే వెసులుబాటు కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

News April 18, 2026

కాళేశ్వరం బ్యారేజ్‌ల పరిశీలనకు 43 రోజుల గడువు

image

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల వైఫల్య కారణాల విశ్లేషణకు రాష్ట్ర ప్రభుత్వం 43 రోజుల గడువు నిర్ణయించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో 9 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. మే 30లోగా పరీక్షలు పూర్తి చేసి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

News April 18, 2026

GNT: పెరుగుతున్న కులాంతర వివాహాలు

image

సమాజంలో కులాల అడ్డు గోడలు కూలుతున్నాయి. యువత ఆలోచనల్లో విశేష మార్పు వస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా 600కు పైగా కులాంతర పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నగరాల్లో ఈ సంఖ్య పెరుగుతుండగా, పల్లెల్లో ఇంకా భయం నెలకొంది. ఈ పెళ్లిళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత ముందున్నారు. వేర్వేరు కులాల మధ్య వివాహాలతో జన్యు వైవిధ్యం పెరిగి భావితరాలు ఆరోగ్యంగా ఉంటాయని సైన్స్ చెబుతోంది.