News March 9, 2025
సంగారెడ్డి: 21 రోజులు.. చేయాల్సిన ఖర్చు రూ.39 కోట్లు

మిగిలింది 21 రోజులు.. ఖర్చు చేయాల్సింది రూ.39 కోట్లు. ఈ లెక్కలు ఏంటని అనుకుంటున్నారా.. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పనిదినాలను బట్టి జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మంజూరు అవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.60.40 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని 50 శాతం నిధులు ఖర్చు చేశారు. మార్చి 31లోపు రూ.39 కోట్లు ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కి పోనున్నాయి.
Similar News
News March 16, 2026
ADB: బహిరంగంగా మద్యం తాగుతున్నారా? అయితే జైలుకే!

ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని పట్టుకునేందుకు ప్రతిరోజు 20 ప్రత్యేక పోలీస్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్ల పక్కన మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నేరుగా FIR నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని కోరారు.
News March 16, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. SKLM, VZM, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
– ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.
News March 16, 2026
VZM: గ్యాస్ బుక్ చేశారా..ఐదు రోజుల్లోనే డెలివరీ

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరా అధికారి జి. మురళీనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన తర్వాత ఐదు రోజుల్లోగా డెలివరీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, మూడు గ్యాస్ కంపెనీలు సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన వెల్లడించారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


