News March 9, 2025
లక్షెట్టిపేట: విద్యుత్ షాక్తో మహిళ మృతి

లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల (40) విద్యుత్ షాక్తో మృతి చెందిందని ఎస్ఐ సతీష్ తెలిపారు. ఆదివారం ఉదయం వాటర్ హీటర్ పెడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురైందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 25, 2026
పండ్రేగుపల్లి నేత అదృశ్యం సుఖాంతం.. హైదరాబాద్లో ఆచూకీ

పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్ పాము సెల్వరాజు <<19470053>>కిడ్నాప్ <<>>కలకలం సుఖాంతమైంది. బుధవారం ఉదయం వాకింగ్కు వెళ్లి ఆయన అదృశ్యం కావడంతో కిడ్నాప్నకు గురయ్యారనే ప్రచారం జరిగింది. బంధువుల ఫిర్యాదుతో సీఐ వడ్డేపల్లి మురళీ దర్యాప్తు చేపట్టి, సెల్వరాజు హైదరాబాద్లో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. వ్యక్తిగత పనులపైనే వెళ్లానని ఆయన తెలపడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
News March 25, 2026
బొలిశెట్టికి మా పార్టీతో సంబంధం లేదు: జనసేన

బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబందం లేదని జనసేన కార్యలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించి పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు తెలిపింది. కావున బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలకి జనసేన పార్టీకి సంబంధం లేదన్నారు.
News March 25, 2026
జూరాల – ఆత్మకూరు రాకపోకలు బంద్

దిగువ జూరాల జెన్కో యూనిట్ల నుంచి టర్బైన్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేయడంతో గద్వాల – ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉద్ధృతి పెరగడంతో ప్రయాణికుల రక్షణార్థం పోలీసులు బుధవారం రోడ్డును మూసివేశారు. కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన ఈ దారి మళ్లీ మూతపడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.


