News March 9, 2025
సిద్దిపేట: రెండు రోజుల్లో పెళ్లి.. యువకుడి పరార్

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన యువతికి, జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఓ యువకుడికి వివాహ నిశ్చయం జరిగింది. ఈ నెల 8న చేర్యాల పట్టణంలోని ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే 2 రోజుల క్రితం యువకుడు తమ స్వగ్రామ సమీపంలోని మరో గ్రామానికి చెందిన యువతితో ఉడాయించాడు. విషయం తెలిసిన యువతి కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. పెళ్లి నిలిచిపోవడంతో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News July 9, 2025
నిమిష మరణ శిక్ష రద్దుకు చివరి మార్గమిదే..

హత్య కేసులో కేరళ నర్సు <<16996463>>నిమిషకు<<>> యెమెన్ ఈనెల 16న మరణశిక్ష అమలు చేయనుంది. ఆమెకు శిక్ష తప్పాలంటే మృతుడి కుటుంబసభ్యులు క్షమాభిక్ష పెట్టడమే చివరి మార్గం. ఇందుకు 2020 నుంచి మానవ హక్కుల యాక్టివిస్ట్ జెరోమ్ ప్రయత్నిస్తున్నారు. వారికి $1 మిలియన్ పరిహారం, మృతుడి సోదరుడికి UAE లేదా సౌదీలో శాశ్వత నివాసం వంటి ఆఫర్లిచ్చారు. భారత ప్రభుత్వం సహకరిస్తోందని, లేదంటే ఇప్పటికే మరణశిక్ష అమలయ్యేదని జెరోమ్ తెలిపారు.
News July 9, 2025
డ్రాప్ అవుట్ విద్యార్థులు ఓపెన్ స్కూల్లో చదవాలి: కలెక్టర్

విద్యలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ చేతుల మీదుగా ఓపెన్ స్కూల్ క్యాలెండర్ పోస్టర్ ఆవిష్కరించారు. నిరక్షరాస్యులు ఉల్లాస్ కార్యక్రమంలో భాగస్వాములై అక్షరాస్యులుగా మారాలని కొరారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
News July 9, 2025
ఆరు బయట చెత్తను వేస్తే.. పరువు పోవడం పక్కా!

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దనే ఉద్దేశంతో మున్సిపాలిటీలు ఇంటింటికీ వెళ్లి చెత్తను కలెక్ట్ చేస్తుంటాయి. అయినప్పటికీ కొందరు బయటే చెత్త వేసి ఇతరులను ఇబ్బంది కలగజేస్తుంటారు. అలాంటివారికి బుద్ధి చెప్పాలని గుజరాత్లోని వడోదరా మున్సిపాలిటీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. రోడ్డు పక్కన చెత్త వేసేవారి ఫొటోలను తీసి పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇలా అయినా ప్రజలకు ఈ అలవాటును మార్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది.