News March 9, 2025
చేర్యాల: రెండు రోజుల్లో పెళ్లి.. యువకుడి పరార్

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన యువతికి, జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహ నిశ్చయం జరిగింది. ఈనెల 8న చేర్యాల పట్టణంలోని ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే 2 రోజుల క్రితం యువకుడు మరో యువతితో ఉడాయించాడు. విషయం తెలిసిన యువతి కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. పెళ్లి నిలిచిపోవడంతో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలోని 71 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేష్ కుమార్ తెలిపారు. మొత్తం 19,158 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,840 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 98.34 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.
News February 24, 2026
నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు కీలక బాధ్యత

భారత పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్గా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నియమితులయ్యారు. భారత్-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, విద్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం గ్రూప్ ప్రధాన లక్ష్యం. కమిటీలో రంజన్ గొగోయ్, రణదీప్ సుర్జేవాలా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు.
News February 24, 2026
ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు

ఎండు ద్రాక్షను నేరుగా తినడం కంటే నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయంటున్నారు నిపుణులు. ఎండుద్రాక్షలను నానబెట్టినప్పుడు వాటిపై ఉండే పొర మెత్తబడి, లోపల ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీరం సులభంగా గ్రహించేలా మారుతాయంటున్నారు. దీనివల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం, రోగనిరోధక శక్తి, ఎముకల బలం పెరగడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.


