News March 9, 2025
పాకిస్థాన్ ఎందుకు ఓడింది?: రైనా

ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకే వేదికలో ఆడటం భారత్కు కలిసొచ్చిందని పలువురు చేస్తున్న విమర్శలపై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించారు. ‘పాకిస్థాన్ స్వదేశంలోనే ఆడింది కదా? ఎందుకు గెలవలేకపోయింది. దుబాయ్ భారత్కు హోం గ్రౌండ్ కాదు. IND ట్రోఫీ కచ్చితంగా గెలుస్తుంది. భారత జట్టును రోహిత్ శర్మ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇవాళ గిల్ అదరగొడతారు. టాస్ కీలకంగా ఉంటుంది’ అని రైనా విశ్లేషించారు.
Similar News
News March 28, 2026
ఏడాది పొడవునా కాపునిచ్చే మామిడి!

సాధారణంగా మామిడి వేసవిలోనే దొరుకుతుంది. కానీ రాజస్థాన్కు చెందిన రైతు కిషన్ సుమన్ పదేళ్లు శ్రమించి ‘సదాబహార్’ అనే మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏడాదికి మూడుసార్లు కాపునిస్తూ తియ్యగా, తక్కువ పీచుతో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ తోటలోనూ ఇది చోటు సంపాదించుకుంది. మామిడి ప్రియులకు ఏడాది పొడవునా పండ్లను అందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈయన 7 రంగుల గులాబీ మొక్కనూ అభివృద్ధి చేశారు.
News March 28, 2026
SRHకు యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్గా ఇషాన్ కిషన్!

ఇవాళ RCBతో జరిగే మ్యాచ్లో కెప్టెన్సీ చేయడం ద్వారా SRH ప్లేయర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించనున్నారు. సన్ రైజర్స్కు నాయకత్వం వహించనున్న యంగెస్ట్(27Y 253D) ఇండియన్ కెప్టెన్గా నిలవనున్నారు. గతంలో శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కాస్త లేటు వయసులో సారథ్యం చేపట్టారు. ఓవరాల్గా ఈ జాబితాలో విలియమ్సన్(27Y 244D) టాప్లో ఉన్నారు. కేన్ మామ 2018లో తొలిసారి SRHను లీడ్ చేసిన విషయం తెలిసిందే.
News March 28, 2026
రోజూ పండ్లు తింటే అంతా ఆరోగ్యమే: వైద్యులు

రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అయితే రోజుకు 2-3 రకాల పండ్లు తినడం మన ఆరోగ్యానికి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ‘పండ్లలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. పండ్లలోని సహజమైన చక్కెర.. మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది. పండ్లు తినకపోతే గుండె జబ్బులు, ఇన్ఫ్లమేషన్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవు. అందుకే పండ్లు తినాలి’ అని వివరించారు.


