News March 9, 2025
కూటమి విద్యార్థులను మోసం చేసింది: అవినాశ్

ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైసిపి శ్రేణులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అబద్దాలు చెప్పి విద్యార్థులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
Similar News
News March 10, 2025
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్, వక్ఫ్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. మణిపుర్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం లోక్సభ ఆమోదం కోరే అవకాశముంది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
News March 10, 2025
లోక్ అదాలత్ ద్వారా 1,211 కేసులు పరిష్కరించాం: ఎస్పీ

దేశవ్యాప్తంగా నిర్వహించబడిన జాతీయ లోక్ అదాలతో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసులను పరిష్కరించామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. ఐపీసీ కేసులు 601, ఎక్సైజ్ కేసులు 473, స్థానిక చట్టాలు సంబంధించిన కేసులు 133 మొత్తం కలిపి 1,211 కేసులను పరిష్కరించామని తెలిపారు. డీసీఆర్బీ సీఐ నరసింహారావు, కోర్టు సిబ్బందిని అభినందించారు.
News March 10, 2025
వరంగల్లో విధులు సంతృప్తినిచ్చాయి: అంబర్ కిషోర్ ఝా

వరంగల్ కమిషనరేట్లో సీపీగా పనిచేయడం సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళ్తున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్కు బదిలీపై వెళ్తున్న అంబర్ కిషోర్ ఝాతోపాటు, సీఐడీ ఎస్పీగా బదిలీ అయిన ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్ను కమిషనరేట్ పోలీస్ అధికారులు ఆదివారం ఘనంగా సత్కరించారు.