News March 9, 2025

ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు?: YCP

image

AP: అమరావతికి నిధుల కేటాయింపుపై వైసీపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘అధికారంలోకి రాగానే ఆఘమేఘాల మీద అమరావతి అభివృద్ధికి రూ.6000 కోట్లు కేటాయించారు. ఆ డబ్బు ఎడాపెడా ఖర్చు చేసేసి ఆ తర్వాత అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని ఊదరగొట్టారు. ఇప్పుడు ఇదే నిధులు భూస్వాముల పెన్షన్లకు అని కబుర్లు చెబుతున్నారు. ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు? ప్రజల కళ్లకు గంతలు కట్టడానికా?’ అని CM చంద్రబాబును YCP ప్రశ్నించింది.

Similar News

News March 10, 2025

ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి నిల్వలు

image

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇరు ప్రాజెక్టుల్లో ఇంకా 45 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా ఏపీ జలదోపిడీ చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌లో 29.27 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 8.35 టీఎంసీలు, సింగూరు ప్రాజెక్టులో 22.34 టీఎంసీలే ఉన్నాయి.

News March 10, 2025

ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

image

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://edcet.tgche.ac.in

News March 10, 2025

PHOTOS: ట్రోఫీతో క్రికెటర్లు

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గి భారత జట్టు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ధోనీ సారథ్యంలో 2013లో గెలిచాక 2017లోనూ అవకాశం వచ్చినా ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ సారి వచ్చిన ఛాన్స్‌ను రోహిత్ సేన ఒడిసిపట్టుకుంది. హిట్ మ్యాన్ నాయకత్వంలో సమిష్టిగా రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా కప్పును అందుకుంది. ఈ క్రమంలో కప్పుతో క్రికెటర్లు ఫొటోలకు పోజులిచ్చారు.

error: Content is protected !!