News March 9, 2025
కామారెడ్డిలో ప్రజావాణి కార్యక్రమం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణి కి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజావాణిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News April 3, 2026
MDK: గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు!

సొంతంగా ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు తీపి కబురు. ఎస్సీ కార్పొరేషన్ (2025-26) స్వయం ఉపాధి రుణాల దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి ఏప్రిల్ 2వ తేదీతోనే ఈ గడువు ముగిసినప్పటికీ, మరికొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు గడువు పెంచారు. అర్హులైన అభ్యర్థులు <
News April 3, 2026
ధురంధర్-2 సంచలనం.. ₹1,500 కోట్లు దాటిన కలెక్షన్లు

రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్-2 మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. రిలీజైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1,501 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఇండియాలో ₹1,134 కోట్లు, విదేశాల్లో ₹367 కోట్లు రాబట్టినట్లు పేర్కొంది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు నటించారు.
News April 3, 2026
భద్రాద్రిలో వైభవంగా సీతారాముల నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణ వేడుక శాస్త్రోక్తంగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, అనంతరం మిథిలా స్టేడియంలో కల్యాణ క్రతువును వైభవంగా జరిపించారు. ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జైశ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.


