News March 23, 2024

ఇక బిడ్డను కనలేను: నటి

image

ఇకపై తాను బిడ్డను కనలేనని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ అన్నారు. ‘నాకు కూతురు పుట్టిన తర్వాత ఏడేళ్లు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించా. నాలుగేళ్ల క్రితం గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయా. ప్రస్తుతం నా వయసు 46 ఏళ్లు. ఈ వయసులో ఇక బిడ్డను కనలేను. నా కూతురికి చెల్లినో, తమ్ముడినో ఇవ్వలేకపోయాననే బాధ మెలిపెడుతోంది’ అని ఆమె పేర్కొన్నారు.

Similar News

News October 2, 2024

మంత్రి కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

image

TG: మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సురేఖ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.

News October 2, 2024

గాజాతో CEASE FIRE ఔట్ ఆఫ్ క్వశ్చన్: డిఫెన్స్ ఎక్స్‌పర్ట్

image

వెస్ట్ ఏషియాలో యుద్ధం బహుముఖంగా మారిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ యోసి కుపర్‌వాసర్ అన్నారు. ఈ టైమ్‌లో గాజాతో సీజ్ ఫైర్, టూ స్టేట్ సొల్యూషన్‌పై చర్చలు జరిగే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం గాజా, లెబనాన్‌లో నాయకత్వ మార్పు పైనే ఇజ్రాయెల్ దృష్టి సారించిందని తెలిపారు. ఈ వివాదానికి అసలైన పరిష్కారం కోసం ఇరాన్‌ను తిరిగి రియలిస్టిక్ సైజుకు తీసుకురావడం, ఆ ప్రజల లివింగ్ స్టాండర్ట్స్ పెంచాల్సి ఉందన్నారు.

News October 2, 2024

రైల్వేట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

image

ఝార్ఖండ్‌లో దుండగులు రెచ్చిపోయారు. సాహిబ్‌గంజ్ జిల్లా రంగాగుట్టు గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై పేలుడు పదార్థాలు అమర్చి పేల్చేశారు. దీంతో ట్రాక్‌పై మూడడుగుల గొయ్యి పడింది. ట్రాక్ పరికరాలు సుమారు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.